ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, ఆయన సతీమణి కందుల వసంత లక్ష్మి, దక్షిణ కాశీగా ప్రసిద్ధమైన పొదిలి పట్టణంలోని శ్రీ నిమ్న మహేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, ద్వీప జ్వాలలను వెలిగించి భక్తులకు కనువిందు చేశారు. ఈ సందర్భంగా ఎండోమెంట్ అధికారులు, తెలుగుదేశం నాయకులు, భక్తులు ఎమ్మెల్యే దంపతులకు ఘన స్వాగతం పలికారు.