అబ్దుల్లాపూర్మెట్లో దారుణం చోటుచేసుకుంది. రవికుమార్(47) అనే వ్యక్తి డబ్బు కోసం తన భార్య లింగం మహేశ్వరి(40)ని కత్తితో పొడిచి చంపాడు. రాచర్ల (M) చోళవీడుకు చెందిన ఈ దంపతులు జీవనోపాధి కోసం అబ్దుల్లాపూర్మెట్కు వచ్చారు. ఇటీవల హోటల్ పని నుంచి తొలగించబడిన రవి, ఏప్రిల్ 29న భార్యను డబ్బు అడిగాడు. ఆమె ఇవ్వకపోవడంతో కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలైన మహేశ్వరి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మే 3న మృతి చెందింది.