ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రజలను పూర్తిస్థాయిలో సంతృప్తిపరచడమే అధికారుల లక్ష్యమని కలెక్టర్ విజయ సునీత స్పష్టం చేశారు. మార్కాపురం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ, ఐ. వి. ఆర్. ఎస్ సర్వేల్లో కొన్ని శాఖలు వెనుకబడి ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. రెవెన్యూ, మైనింగ్, తాగునీరు, పారిశుద్ధ్యం, ఆర్టీసీ శాఖలు తమ పనితీరును మెరుగుపరుచుకొని, ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.