అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లాలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు సోమవారం విద్యార్థినులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. సమాజంలో మహిళల ప్రాముఖ్యత, వారు ఎదుర్కొంటున్న వేధింపులు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు పోలీసులు బహుమతులు అందజేశారు.