మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం రాత్రి ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలినేని ఒంగోలుకు ఏమి చేశారని ఆయన ప్రశ్నించారు. ఏదైనా తప్పు చేసి ఉంటే నిరూపించాలని సవాల్ విసిరిన దామచర్ల, హైదరాబాద్లో ఉంటూ స్థానిక రాజకీయాలపై మాట్లాడటం హాస్యాస్పదమని విమర్శించారు.