ప్రకాశం జిల్లా ఒంగోలులోని త్రోవగుంట బృందావనం కల్యాణ మండపం వద్ద శుక్రవారం కారు ఢీకొని కర్నాటి వెంకటసుబ్బారెడ్డి అనే వ్యక్తి మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడిని గుర్తించారు. ప్రమాదం జరిగిన తీరుపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.