ఒంగోలు మండలం కరవాది గ్రామ సమీపంలో బుధవారం రైల్వే పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, వివరాలు తెలియకపోవడంతో ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తించాల్సిందిగా ఒంగోలు రైల్వే పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.