ప్రకాశం జిల్లాలో ఎస్ఐలుగా పనిచేస్తూ సీఐలుగా పదోన్నతి పొందిన కమలాకర్, మురళి, వెంకట కృష్ణయ్యలను ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, నూతన సీఐలు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి, పదోన్నతులు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని ఎస్పీ వారికి సూచించారు.