జిల్లావ్యాప్తంగా కార్తిక పౌర్ణమి సందర్భంగా బుధవారం దేవాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశించారు. కర్నూలు జిల్లాలో జరిగిన దుర్ఘటన నేపథ్యంలో, ప్రజలు గుంపులుగా దేవాలయాలకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బందిని ఆయన ఆదేశించారు. దీంతో అధికారులు జిల్లాలోని దేవాలయాల వద్ద భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.