ప్రకాశం జిల్లా ఒంగోలు రైల్వే స్టేషన్ అవుట్ గేట్ వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం మున్సిపల్ కార్పొరేషన్ తరఫున లోటస్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు శుక్రవారం వీటిని పరిశీలించి, ప్రయాణికుల సౌలభ్యం కోసం నగరపాలక సంస్థ తరఫున టాయిలెట్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.