ప్రకాశం జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమైంది. ఒంగోలు నగరంలోని పలు బంకుల్లో ఇంధన నిల్వలు నిండుకోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని బంకుల్లో ఒక్కో వాహనానికి రూ. 200 కంటే ఎక్కువ డీజిల్ కొట్టడంలేదని ఆటో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజంతా ఆటో నడపడానికి ఇది సరిపోదని వారు వాపోతున్నారు.