ప్రకాశం జిల్లా దోర్నాల మండలం మెట్ల మల్లికార్జునపురం లోని ఏపీ మోడల్ స్కూల్ ని మంగళవారం స్థానిక టిడిపి ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు సందర్శించారు. విద్యార్థులతో కలిసి ఆహారాన్ని పూజించిన ఆయన అక్కడ అందుతున్న సదుపాయాలను విద్యార్థులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారాన్ని అందించాలని, విద్యార్థులు నివసిస్తున్న ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని అధికారులకు ఎరిక్షన్ బాబు సూచించారు.