రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు

4చూసినవారు
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం కొత్త గుడి వేముల గ్రామ సమీపంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గాలివానకు రోడ్డుపై కూలిన చెట్టును తప్పించే ప్రయత్నంలో తుఫాను వాహనం పక్కనే ఉన్న ఎండిన కాలువలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో తుఫానులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వినుకొండకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్