రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన నియోజకవర్గంలోని పలు పెట్రోల్ బంకులను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ఇంధన కొరతకు కూటమి ప్రభుత్వ అసమర్థతే కారణమని విమర్శించారు. బంకుల వద్ద వేచి ఉన్న వాహనదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. రైతులు, కూలీలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.