యర్రగొండపాలెం మండలంలో మొంథా తుఫాన్ కారణంగా నల్లమల అటవీ ప్రాంతంలో వరద తాకిడికి పాలుట్ల గ్రామానికి వెళ్లే రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి చేరాల్సిన రేషన్ బియ్యం లారీలు వెళ్లలేని పరిస్థితి నెలకొనడంతో, అధికారులు 4 ట్రాక్టర్ల ద్వారా బియ్యాన్ని తరలించారు. మార్గమధ్యలో కొన్ని ట్రాక్టర్లు వాగులో చిక్కుకున్నప్పటికీ, గ్రామస్థుల సహాయంతో అతికష్టం మీద బియ్యాన్ని పాలుట్లకు చేర్చారు.