ప్రకాశం జిల్లా త్రిపురాంతకం లోని సాగర్ కాలవలో శనివారం సాయంత్రం సమయంలో ఆత్మహత్య చేసుకునేందుకు కాలవలోకి దూకిన సుబ్బయ్య మృతదేహం ఎట్టకేలకు సోమవారం పోలీసులు గుర్తించారు. స్నేహితులతో కలిసి సుబ్బయ్య సరదాగా సాగర్ కాలువలోకి ఈతకు వెళ్ళాడు. ఆ సమయంలో అప్పు తీర్చమని స్నేహితులు నిలదీయడంతో మనస్థాపం చెందిన సుబ్బయ్య సాగర్ కాలవలోకి దూకి గల్లంతయ్యాడు. జరిగిన ఘటనపై పూర్తి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.