ప్రకాశం జిల్లా పుల్లలచెరువు పోలీసులు, తెలుగు రాష్ట్రాలలో ద్విచక్ర వాహనాలు దొంగిలిస్తున్న ఇద్దరు వ్యక్తులను బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. డిఎస్పీ నాగరాజు మరికొద్దిసేపట్లో ఈ ఘటనపై పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించనున్నట్లు పోలీసులు తెలిపారు.