
మెంతా తుఫాను: ప్రజల సేవలకు కాల్ సెంటర్ ఏర్పాటు
మెంతా తుఫాను నేపథ్యంలో, పుల్లలచెరువు మండల పరిషత్ కార్యాలయంలో తుఫాను కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో సంజీవరావు తెలిపారు. ఈ కాల్ సెంటర్ మూడు రోజులపాటు ప్రజలకు సేవలు అందిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 96184 94127, 82470 31301, 9154808768 నంబర్లను సంప్రదించాలని సూచించారు.







































