బాలీవుడ్ నటి ప్రీతి జింటా దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత 'బత్వారా 1947' చిత్రంతో వెండితెరపైకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఆగస్టు 14న విడుదల కానున్న ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న ప్రీతి, తన కెరీర్ కంటే భర్త, పిల్లలే తనకు ముఖ్యమని పేర్కొంది. కుటుంబంతో గడిపిన సమయం విలువైనదని, పిల్లల పెంపకంలో ఆనందం ఉందని తెలిపింది. ఓటీటీ ప్రాజెక్టులపై ఆసక్తి చూపడం లేదని, ప్రోత్సహించే కథలు వస్తేనే సినిమాలు చేస్తానని వెల్లడించింది.