AP: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం బలగాలను పంపించాలని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైసీపీ నేతలపై ఆటవిక దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రేక్షక పాత్ర పోషించాలని పోలీసులకు పైనుంచి ఆదేశాలు వస్తున్నాయని, వైసీపీ మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు జరుగుతున్నా చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.