AP: పుట్టపర్తి విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్తో పాటు పలువురు మంత్రులు ఆయనకు స్వాగతం పలికారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొని, సాయి కుల్వంత్ హాల్లో సత్యసాయి మహా సమాధిని దర్శించుకోనున్నారు. అనంతరం హిల్ వ్యూ ఆడిటోరియంలో బాబా జీవితం, బోధనలు, సేవలను గుర్తు చేసే రూ.100 నాణెం, నాలుగు తపాలా బిళ్లలను ప్రధాని ఆవిష్కరించనున్నారు.