ప్రధాని
మోదీ నేటి (సోమవారం) నుంచి మూడు దేశాల పర్యటనకు బయలుదేరుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మొదట జులై 6 నుంచి 8 వరకు ఇండోనేషియాలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం జులై 8 నుంచి 10 వరకు
ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. చివరగా జులై 10 నుంచి 11 వరకు న్యూజిలాండ్లో ఉంటారు. ఈ మూడు దేశాల పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చలు జరపనున్నారు.