ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియా వినియోగంపై బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు సోషల్ మీడియా వేదికల్లో పోస్టులు పెట్టే ముందు సంబంధిత శాఖల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యోగులకు ఇవి వర్తిస్తాయని స్పష్టం చేసింది. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు, అధికారిక సమాచారం అనుమతి లేకుండా షేర్ చేయరాదని సూచించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది.