ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో యెమెన్లోని ఇరాన్ అనుకూల హౌతీ గ్రూప్ రంగంలోకి దిగింది. ఇజ్రాయెల్లోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని భారీగా క్షిపణులతో విరుచుకపడింది. ఈ దాడిని తామే చేసినట్లు హౌతీ రెబల్స్ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యాహ్యా సరీ అధికారికంగా ప్రకటించారు. ఇరాన్పై జరుగుతున్న దాడులకు నిరసనగా, ఇజ్రాయెల్ దురాక్రమణకు వ్యతిరేకంగా ఈ చర్య తీసుకున్నామని వెల్లడించారు.