వైసీపీ నుంచి టీడీపీలో చేరేందుకు వచ్చిన మూడు కుటుంబాలకు కడప జిల్లా వేంపల్లి మండలం అమ్మాయిగారి పల్లెలో గ్రామస్తులు వినూత్న నిరసన తెలిపారు. టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి వారికి కండువా కప్పేందుకు వెళ్లగా, గ్రామస్తులు ఆయన రాకను వ్యతిరేకిస్తూ ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. వైసీపీ నేతలు టీడీపీలో చేరుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.