ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీహెచ్డీ సీట్ల భర్తీకి నిర్వహించే ఆర్సెట్ 2025ను నవంబరు 3 నుంచి 7 వరకు నిర్వహించనున్నారు. అక్టోబర్ 6న నోటిఫికేషన్ను విడుదల చేసి అక్టోబరు 7 నుంచి దరఖాస్తుల స్వీకరిస్తారు. ఈ ఏడాదికి ఆర్సెట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యతలను శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి అప్పగించారు.