రైల్వేశాఖ ప్రయాణికుల సౌకర్యం కోసం నిబంధనలను కఠినతరం చేసింది. జనరల్ లేదా వెయిటింగ్ లిస్ట్ టికెట్తో రిజర్వ్ చేయని కోచ్లలోనే ప్రయాణించాలి. స్లీపర్ లేదా ఏసీ కోచ్లలో ప్రయాణించాలంటే తప్పనిసరిగా రిజర్వేషన్ చేయించుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించి స్లీపర్ కోచ్లో ప్రయాణిస్తే రూ.250, ఏసీ కోచ్లో ప్రయాణిస్తే రూ.440 వరకు జరిమానా విధించబడుతుంది. ప్రయాణికులు ఈ నిబంధనలను పాటించి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించాలని సూచించారు.