మహిళల ప్రీమియర్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. యూపీ వారియర్స్పై 8 వికెట్ల తేడాతో గెలుపొందిన ఆర్సీబీ, 12 పాయింట్లతో నాలుగో సీజన్ ఫైనల్లో అడుగుపెట్టింది. 149 పరుగుల ఛేదనలో ఓపెనర్ గ్రేస్ హ్యారిస్ 75 పరుగులు చేయగా, స్మృతి మంధాన 54 నాటౌట్తో అదరగొట్టింది. వరుసగా ఐదు విజయాలతో ప్లే ఆఫ్స్ చేరిన ఆర్సీబీ, రెండు ఓటముల నుంచి కోలుకొని ఈ విజయాన్ని అందుకుంది.