AP: చంద్రబాబు చేసిన కల్తీని వైసీపీపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ ధ్వజమెత్తారు. ఆదివారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ.. ‘ఎన్నికల ప్రచారం కోసం చేసే ఐవీఆర్ఎస్ కాల్స్ను నకిలీ మద్యం కోసం టీడీపీ వాడుతుంది. నకిలీ మద్యం ఎక్కడ తయారైందో? ఎక్కడ సరఫరా అవుతుందో? ఎందుకు ఎంక్వైరీ చేయడం లేదు. నకిలీ మద్యంలో తన హస్తం ఉందంటున్నారు. దమ్ముంటే లై డిటెక్టర్ టెస్ట్ చేయండి’ అని సవాల్ విసిరారు.