AP: నర్సీపట్నం పర్యటనలో భాగంగా వైసీపీ అధినేత జగన్కు విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికులు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని హామీ ఇచ్చిన కూటమి.. ఆ తర్వాత తమను మోసం చేస్తోందని వారు తెలిపారు. ప్లాంట్ను ఎలాగైనా కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు. దీనికి జగన్ సానుకూలంగా స్పందించారు. స్టీల్ ప్లాంట్ కాపాడుకునేందుకు తాము పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. వైసీపీ కార్మికులకు అండగా ఉంటుందన్నారు.