AP: 2026-27 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు కేటాయింపులు భారీగా తగ్గాయి. ఈసారి పోలవరం ప్రాజెక్టుకు రూ.3,320 కోట్లు మాత్రమే కేటాయించారు. గతేడాది బడ్జెట్లో రూ.5,936 కోట్లు ఇచ్చారు. అయితే గతేడాది ఎక్కువ నిధులు కేటాయించినా.. రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం రూ.3,017 కోట్లు మాత్రమే వచ్చాయి.