ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

12చూసినవారు
ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు  హైకోర్టులో ఊరట
AP: ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త. వైద్య కారణాలతో ఆర్టీసీ నుంచి బయటకు వచ్చిన డ్రైవర్లు, ఇతర ఉద్యోగులకు ఏపీ హైకోర్టు ఊరటనిచ్చింది. ప్రత్యామ్నాయ ఉద్యోగం లేదా నగదు పరిహారంపై ఎనిమిది వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. పెండింగ్‌లో ఉన్న అదనపు పరిహారం రిక్వెస్ట్‌లను మూడు నెలల్లో, ప్రత్యామ్నాయ ఉద్యోగ వినతులను ఆరు నెలల్లో పరిష్కరించాలని సూచించింది. ఏపీ హైకోర్టు తీర్పుతో ఉద్యోగులకు కొంత ఊరట లభించింది.

సంబంధిత పోస్ట్