దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సైబర్ మోసాల బాధితులకు న్యాయం అందించే లక్ష్యంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 'మొబైల్ రిస్టోరేషన్ మాడ్యూల్' (MRM) అనే కొత్త సబ్-పోర్టల్ను ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా బాధితులు తమ డబ్బు రీఫండ్ కోసం ఇంటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్లైన్ లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) లో ఫిర్యాదు చేసి, మోసగాడి బ్యాంక్ ఖాతాలోని డబ్బును స్తంభింపజేయించుకున్నవారు ఈ MRM పోర్టల్ ద్వారా రీఫండ్ పొందవచ్చు.