AP: మాజీ సీఎం వై.ఎస్.
జగన్ పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రజలు, రైతులు జగన్ను కలవకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. వాహనాల్లో వచ్చిన రైతులను హైవే వద్దే నిలిపివేస్తున్నారు. ప్రత్యేకంగా బారికేడ్లు ఏర్పాటు చేసి వారిని అడ్డుకోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాలను జగన్కు చెప్పుకోవడానికి వస్తున్న తమను అడ్డుకోవడంపై రైతులు మండిపడుతున్నారు.