AP: RGUKT బీటెక్ ప్రవేశాల ఫలితాలను మంత్రి
లోకేశ్ విడుదల చేశారు. నూజివీడు, ఆర్కే వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళంలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశానికి సంబంధించి తాత్కాలిక ఎంపిక జాబితా విడుదలైనట్లు వెల్లడించారు. మొత్తం 4,410 దరఖాస్తులు రాగా, 4,040 మంది
విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపిక పత్రాలు rgukt.in, వాట్సప్ హెల్ప్డెస్క్ 95523 00009 ద్వారా పొందవచ్చని సూచించారు.