సాస్కీ కింద ఏపీకి గత ఐదేళ్లలో రూ.19,287 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌధరి తెలిపారు. ఆయన సోమవారం లోక్సభలో జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చారు. 2020-21లో రూ.688 కోట్లు, 2021-22లో రూ.501 కోట్లు, 2022-23లో రూ.6,105 కోట్లు, 2023-24లో రూ.4,090 కోట్లు, 2024-25లో రూ.7,901 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. వీటిద్వారా రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులు చేపట్టినట్లు వివరించారు.