జీయో పాలిటిక్స్ నేపథ్యంలో రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ `ధురంధర్`, `ధురంధర్ 2` రికార్డు వసూళ్లతో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో, బాబ్రీ మసీదు కూల్చివేత, ఆర్ ఎస్ ఎస్ వివాదం నేపథ్యంలో సంజయ్ దత్ నటిస్తున్న `ఆఖ్రీ సవాల్` సినిమా దేశ వ్యాప్తంగా మరో సంచలనంగా మారనుందని చర్చ జరుగుతోంది. జాతీయ అవార్డు గ్రహీత అభిజీత్ మోహన్ వారంగ్ దర్శకత్వంలో, ఆర్ ఎస్ ఎస్ శతాబ్ది ప్రయాణం, బాబ్రీ మసీదు అంశాన్ని జోడించి నిర్మించిన ఈ సినిమా మే 8న విడుదల కానుంది. ఇందులో సంజయ్ దత్ ప్రొఫెసర్ గోపాల్ నాదకర్ణి పాత్రలో నటిస్తున్నారు.