న్యూజిలాండ్తో జరిగిన ఐదవ టీ20 మ్యాచ్లో భారత యువ బ్యాటర్ సంజు శాంసన్ మరోసారి విఫలమయ్యాడు. సొంత మైదానం తిరువనంతపురంలో ఆరు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. గత కొన్ని మ్యాచ్లుగా నిలకడగా రాణించలేకపోతున్న శాంసన్, టీ20 ప్రపంచకప్లో తుది జట్టులో చోటు దక్కుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇషాన్ కిషన్, శివం దుబేల ఫామ్ నేపథ్యంలో సంజుకు స్థానం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.