AP: పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్లో పట్టభద్రులైన వారికి ఉప రాష్ట్రపత్రి సీపీ రాధాకృష్ణన్ పట్టాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సత్యసాయి బాబా సిద్ధాంతాలు, సూత్రాలే నిజమైన విద్య అని పేర్కొన్నారు. ఇతరుల గురించి జీవించడమే ఉత్తమమని, ఆధునిక విధానాలతో పాటు సంప్రదాయాలను పాటించాలని సూచించారు. డ్రగ్స్ అతిపెద్ద సవాలుగా మారాయని, 'నో టూ డ్రగ్స్' అంటూ పెద్దఎత్తున ప్రచారం చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.