‘దృశ్యం 3’ ఓటీటీలోకి.. మళ్లీ ఉత్కంఠ రేపనున్న జార్జ్‌కుట్టి

2724చూసినవారు
‘దృశ్యం 3’ ఓటీటీలోకి.. మళ్లీ ఉత్కంఠ రేపనున్న జార్జ్‌కుట్టి
మోహన్‌లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'దృశ్యం 3' చిత్రం జూన్ 18 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ థ్రిల్లర్ మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. జార్జ్‌కుట్టి కుటుంబాన్ని గతం వెంటాడటం, రహస్యాలను వెలికితీయడానికి జర్నలిస్టుల ప్రయత్నాలు, కూతురి పెళ్లి సంబంధంలో కొత్త మలుపులు కథలో ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. ఉత్కంఠ భరితమైన స్క్రీన్‌ప్లే, మోహన్‌లాల్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్