AP: ప్రైవేటు పాఠశాలల్లో రైట్ టు ఎడ్యుకేషన్ (RTE) చట్టం కింద పేద, వెనుకబడిన వర్గాల పిల్లలకు 25% సీట్లు ఉచితంగా కేటాయించే ప్రక్రియకు షెడ్యూల్ విడుదలైంది. 2026-27 విద్యా సంవత్సరానికి 1వ తరగతి ప్రవేశాల కోసం ఫిబ్రవరి 6 నుండి 16 వరకు పోర్టల్లో పాఠశాలల డేటాను అప్డేట్ చేస్తారు. ఫిబ్రవరి 20 నుండి మార్చి 10 వరకు విద్యార్థుల నమోదు ప్రక్రియ జరుగుతుంది. మార్చి 25న మొదటి విడత లాటరీ ద్వారా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తామని SSA డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.