శ్రీ అమర్నాథ్ యాత్ర ప్రారంభానికి ముందు, శ్రీనగర్లోని పఠాన్ చౌక్ బేస్ క్యాంప్లో ఉగ్రవాద వ్యతిరేక మాక్ డ్రిల్ను నిర్వహించారు. కొత్తగా నిర్మించిన 'శ్రీ ప్రేమ్ గార్గ్ భవన్' యాత్రి నివాస్ వద్ద జమ్మూ కాశ్మీర్ పోలీసులు, పారామిలిటరీ బలగాలు ఈ డ్రిల్ ను చేపట్టాయి. యాత్ర సందర్భంగా భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు, సన్నద్ధతను పరీక్షించేందుకు ఉద్దేశించి నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. యాత్రికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
VEDIO CEREDIT: ANI