AP: దావోస్లోని బెల్వేడార్లో మిట్టల్ గ్రూప్ చైర్మన్ లక్ష్మీ మిట్టర్తో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సమావేశం అయ్యారు. భావనపాడును పెట్రో కెమికల్ హబ్గా మార్చడానికి పెట్టుబడులు పెట్టాలని మంత్రి కోరారు. రూ.3,500 కోట్లతో భారత్లో ఏర్పాటు చేయాలనుకుంటున్న 2 జీడబ్ల్యూ సామర్థ్యం గల సోలార్ సెల్ తయారీ ప్లాంట్ను ఏపీలో నెలకొల్పాలని కోరారు. ఈ మేరకు పెట్రో కెమికల్స్, గ్రీన్ ఎనర్జీలో నూతన ఆవిష్కరణలకు అవకాశాలు ఉన్నాయని వివరించారు.