AP: అనకాపల్లి జిల్లాలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. ఏలేరు కాలువలో ఏడేళ్ల బాలుడు అయ్యప్ప మాలధారణ భక్తులతో కలిసి దిగాడు. ప్రమాదవశాత్తు బాలుడు కాలువలో మునిగి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు.