భుజాల నుంచి రెండు చేతులు లేని కశ్మీర్ పారా ఆర్చర్ శీతల్ దేవి ప్రతిభకు ప్రపంచ గుర్తింపు లభించింది. 2025 సంవత్సరానికి గాను ప్రపంచ ఆర్చరీ 'పారా ఆర్చర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును ఆమె అందుకుంది. గతేడాది గ్వాంగ్జూలో జరిగిన ప్రపంచ పారా ఆర్చరీ చాంపియన్షిప్లో ఆమె స్వర్ణం సాధించడంతో పాటు, మహిళల టీమ్ ఈవెంట్లో రజతం, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్యం గెలుచుకుంది. పారిస్ పారాలింపిక్స్లోనూ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్యం నెగ్గింది.