మొబైల్ టెలికాం కంపెనీలు తమ యూజర్లకు త్వరలో షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రాబోయే మూడు, నాలుగు నెలల్లో మొబైల్ చార్జీలను భారీగా పెంచే అవకాశం ఉందని 'సెంట్రమ్ ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్' వెల్లడించింది. 12 శాతం నుండి 15 శాతం వరకు టారిఫ్లు పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. 4G/5G నెట్వర్క్లు పెరగడం వల్ల డేటా వినియోగం అధికమైందని పేర్కొంది. జూన్ త్రైమాసికంలో కంపెనీల ARPU(యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్) 1-1.5 శాతం వరకు పెరుగుతుందని అంచనా వేసింది.