AP: రేేషన్ కార్డుదారులకు షాకింగ్ న్యూస్. ఈ నెలలో కూడా కందిపప్పు పంపిణీ పరిస్థితులు కనిపించడం లేదు. ప్రభుత్వం కందిపప్పుతో పాటు పామాయిల్, గోధుమలు, రాగులు, జొన్నలు వంటి నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. కానీ ఈ ప్రణాళికలు ఇంకా అమలు దశకు చేరుకోలేదు. టెండర్ల ప్రక్రియలో జాప్యం కారణంగా ఇది సాధ్యపడటం లేదు. ప్రతినెలా బియ్యం, చక్కెరతో పాటు కందిపప్పును కూడా అందించాలి. కానీ ప్రస్తుతం కందిపప్పు సరఫరా లేకపోవడంతో ఇబ్బంది తలెత్తుతోంది.