టీడీపీకి షాక్.. వైసీపీలోకి భారీగా చేరికలు

AP: కర్నూలు జిల్లా, కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. కంపాడు గ్రామానికి చెందిన 150 టీడీపీ కుటుంబాలు ఆ పార్టీకి గుడ్బై చెప్పి వైసీపీలో చేరారు. కూటమి విధానాలు నచ్చక, ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వల్లే టీడీపీని వీడినట్లు వైసీపీలో చేరిన నేతలు తెలిపారు. చంద్రబాబు నాయుడు పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆరోపించారు.
