AP: కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో గురువారం టీడీపీకి భారీ షాక్ తగిలింది. టీడీపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి కండువాలు కప్పి రేణుక పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కాగా, ఇటీవల టీడీపీకి ఇలా వరుసగా షాక్లు తగులుతున్న విషయం తెలిసిందే.