సామాన్యుడికి షాక్.. పెరిగిన 15 నిత్యావసర వస్తువుల ధరలు

18617చూసినవారు
సామాన్యుడికి షాక్.. పెరిగిన 15 నిత్యావసర వస్తువుల ధరలు
పండుగల సీజన్‌కు ముందు సామాన్యుడి వంటింటి బడ్జెట్‌పై ధరల భారం మరింత పెరిగింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ తాజా గణాంకాల ప్రకారం, గత ఐదు నెలల్లో 16 ప్రధాన నిత్యావసర ఆహార వస్తువుల్లో 15 వస్తువుల ధరలు పెరిగాయి. కందిపప్పు, శనగపప్పు, మినపప్పుతో పాటు వంట నూనెలు, పాలు, చక్కెర ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. బలహీన రుతుపవనాలు, పప్పుధాన్యాల సాగు తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్‌లో వంట నూనెల ధరల పెరుగుదల, పండుగల నేపథ్యంలో డిమాండ్ అధికం కావడం ఇందుకు ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. పరిస్థితులు మారకపోతే రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్